Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బక్రీద్ వేళ మానవత్వాన్ని చాటిన:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:31 PM

సంపూర్ణ అక్షరాస్యత దిశగా నారాయణఖేడ్ పురపాలక సంఘం ముందడుగు

సంపూర్ణ అక్షరాస్యత దిశగా నారాయణఖేడ్ పురపాలక సంఘం ముందడుగు

సంపూర్ణ అక్షరాస్యత దిశగా నారాయణఖేడ్ పురపాలక సంఘం ముందడుగు
May 27, 2026 05:19 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పురపాలక కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘాన్ని సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఉల్లాస్ నవ భారత్ సాక్షరత కార్యక్రమాన్ని ప్రారంభించారు. వయోజన విద్యా శాఖ సహకారంతో నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో వాలంటీర్లకు అక్షరాస్యతపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మౌనిక, పద్మ వాలంటీర్లకు అక్షర వికాసం, బోధనా విధానాలు, నిరక్షరాస్యులకు సులభంగా చదువు నేర్పించే పద్ధతులు, సామాజిక చైతన్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.పురపాలక సంఘ పరిధిలోని నిరక్షరాస్యులకు చదువు నేర్పే బాధ్యతను వాలంటీర్లు చేపట్టనున్న నేపథ్యంలో వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రశాంతి మాట్లాడుతూ చదువు ప్రతి ఒక్కరి హక్కు అని, నిరక్షరాస్యత నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సేవాభావంతో పనిచేసి నారాయణఖేడ్‌ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.ఉమ్మడి మెదక్ జిల్లా ఉప సంచాలకుడు వెంకట్ రెడ్డి పాల్గొని వయోజన విద్య ప్రాధాన్యతను వివరించారు. చదువు ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,ఖేఢ్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు, వెంకటశివయ్య, అనిత, మహిళా సంఘాల సభ్యులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News