సంక్షేమ హాస్టల్పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనురాగ్ జయంతి
సంక్షేమ హాస్టల్పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనురాగ్ జయంతి
Editor Desk
మోత్కూర్,
సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం మోత్కూర్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హాస్టల్లో విద్యార్థుల వసతులు, హాజరు వివరాలు, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు హాస్టల్లోనే ఉంటున్నారా అనే విషయాన్ని పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిరోజూ శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందుతున్నదా అని స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిచెన్ రూమ్, స్టోర్ రూమ్లను పరిశీలించి, వంట సామగ్రి, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, గుడ్లు, నూనె నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన వంట సరుకులు, తాజా కూరగాయలు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా హిమేష్ అనే విద్యార్థితో మాట్లాడి, చదువు, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి