Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల తీర్పు: మత మార్పిడికి అడ్డుకట్ట.. రాజ్యాంగ సవరణ డిమాండ్ గర్జింపు! “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 05:30 PM

సంక్షేమ హాస్టల్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనురాగ్ జయంతి

సంక్షేమ హాస్టల్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనురాగ్ జయంతి

సంక్షేమ హాస్టల్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనురాగ్ జయంతి
March 28, 2026 03:37 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్,

సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం మోత్కూర్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాస్టల్‌లో విద్యార్థుల వసతులు, హాజరు వివరాలు, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు హాస్టల్‌లోనే ఉంటున్నారా అనే విషయాన్ని పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిరోజూ శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందుతున్నదా అని స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిచెన్ రూమ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించి, వంట సామగ్రి, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, గుడ్లు, నూనె నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన వంట సరుకులు, తాజా కూరగాయలు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా హిమేష్ అనే విద్యార్థితో మాట్లాడి, చదువు, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News