Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 22, 2026 06:50 PM

సంఘ అభివృద్ధికి సమిష్టి గా పాటుపడాలి

సంఘ అభివృద్ధికి సమిష్టి గా పాటుపడాలి

సంఘ అభివృద్ధికి సమిష్టి గా పాటుపడాలి
March 22, 2026 05:03 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్: ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి సమిష్టిగా పాటుపడాలని సంఘం మండల అధ్యక్షులు ఇరుకుల వెంకన్న అన్నారు.ఆదివారం స్థానిక ఆర్యవైశ్య సంఘ భవనంలో పట్టణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మొగుళ్ల పెళ్లి సోమయ్య గత ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి, సంఘం లావాదేవీలు, నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న మాట్లాడుతూ సమాజంలో మన సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని కోరారు. అనంతరం పట్టణ సంఘం నూతన కమిటీని మండల అధ్యక్షులు ఇరుకుల్ల వెంకన్న ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పట్టణ సంఘం అధ్యక్షునిగా మొగుళ్ళపల్లి సోమయ్య ని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బండారు రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా మురారి శెట్టి శ్రీధర్ , PROగా బద్ది శెట్టి సంతోష్, ఉపాధ్యక్షులుగా బుక్క విశ్వనాథం,సోమ లింగయ్య,అనంతల అశోక్, కార్యదర్శులుగా బుక్క చంద్రశేఖర్, ఇమ్మడి రమేష్, పందిరి వెంకన్న, గౌరవ సలహాదారులుగా బుస్స శ్రీనివాస్, మిట్టపల్లి నాగేష్, శ్రీనివాస్,సోమ నర్సయ్య, అనంతుల వెంకటయ్య, పల్లెర్ల వెంకన్న ,కార్యవర్గ సభ్యులుగా మాశెట్టి వెంకన్న, సోమ కార్తీక్ ,రాపాక శంకర్, సోమ కిరణ్ ,ఇమ్మడి వినోద్, తోనుపునూరి చంద్రశేఖర్ ,అల్లాడి సోమేశ్వర్ లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మొగుళ్ళపల్లి సోమయ్య మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతానని తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సోమ వెంకటేశ్వర్లు , సోమ సంతోష్, తిపిరిశెట్టి శ్రీనివాస్, చంద్రశేఖర్, మండల కార్యదర్శి గుండా రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News