సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు వేగం.. త్వరలో ప్రారంభోత్సవం
సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు వేగం.. త్వరలో ప్రారంభోత్సవం
Krishna
సంగారెడ్డి పట్టణం మరియు పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు త్వరలో ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి డిస్పెన్సరీని మంజూరు చేశారు. బైపాస్ రోడ్డులో ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న వినియోగంలో లేని ఆర్ అండ్ బి క్వార్టర్స్లో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, భవన మరమ్మత్తుల కోసం జగ్గారెడ్డి తన స్వంత నిధుల నుంచి రూ.8 లక్షలు అందించారు. ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగుతుండగా, 10 పడకలు, 20 మంది సిబ్బందితో డిస్పెన్సరీని సిద్ధం చేస్తున్నారు. అవసరమైన ల్యాబ్, మందులు, వైద్య సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సమీపంలోనే వైద్యసేవలు అందించడంలో ఈ డిస్పెన్సరీ ఎంతో ఉపయోగపడనుందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. మరమ్మత్తు పనులు పూర్తి కాగానే మంత్రి వివేక్ వెంకట స్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి