Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:01 AM

సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు వేగం.. త్వరలో ప్రారంభోత్సవం

సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు వేగం.. త్వరలో ప్రారంభోత్సవం

సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు వేగం.. త్వరలో ప్రారంభోత్సవం
03-05-2026 318 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణం మరియు పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు త్వరలో ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి డిస్పెన్సరీని మంజూరు చేశారు. బైపాస్ రోడ్డులో ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న వినియోగంలో లేని ఆర్ అండ్ బి క్వార్టర్స్‌లో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, భవన మరమ్మత్తుల కోసం జగ్గారెడ్డి తన స్వంత నిధుల నుంచి రూ.8 లక్షలు అందించారు. ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగుతుండగా, 10 పడకలు, 20 మంది సిబ్బందితో డిస్పెన్సరీని సిద్ధం చేస్తున్నారు. అవసరమైన ల్యాబ్, మందులు, వైద్య సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సమీపంలోనే వైద్యసేవలు అందించడంలో ఈ డిస్పెన్సరీ ఎంతో ఉపయోగపడనుందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. మరమ్మత్తు పనులు పూర్తి కాగానే మంత్రి వివేక్ వెంకట స్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Sthanikam

సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు వేగం.. త్వరలో ప్రారంభోత్సవం

Article Image

సంగారెడ్డి పట్టణం మరియు పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు త్వరలో ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి డిస్పెన్సరీని మంజూరు చేశారు. బైపాస్ రోడ్డులో ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న వినియోగంలో లేని ఆర్ అండ్ బి క్వార్టర్స్‌లో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, భవన మరమ్మత్తుల కోసం జగ్గారెడ్డి తన స్వంత నిధుల నుంచి రూ.8 లక్షలు అందించారు. ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగుతుండగా, 10 పడకలు, 20 మంది సిబ్బందితో డిస్పెన్సరీని సిద్ధం చేస్తున్నారు. అవసరమైన ల్యాబ్, మందులు, వైద్య సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి పరిసర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సమీపంలోనే వైద్యసేవలు అందించడంలో ఈ డిస్పెన్సరీ ఎంతో ఉపయోగపడనుందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. మరమ్మత్తు పనులు పూర్తి కాగానే మంత్రి వివేక్ వెంకట స్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News