Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 23, 2026 06:30 PM

సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన హలవత్ బిక్షం. నున్న నాగేశ్వరరావు.

సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన హలవత్ బిక్షం. నున్న నాగేశ్వరరావు.

సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన హలవత్ బిక్షం.  నున్న నాగేశ్వరరావు.
March 23, 2026 04:37 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన హలవత్ బిక్షం.... సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు..

నవతెలంగాణ- కూసుమంచి

పేద ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకోవడంతో పాటు ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసిన హలవత్ బిక్షం నాయక్ మృతి చెందటం సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని కోక్ర తండా గ్రామంలో కళావత్ బిక్షం నాయక్ సంస్కరణ సభ జరిగింది .ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ.. హళవత్ బిక్షం నాయక్ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఈ ప్రాంతంలో దొరల వ్యతిరేకంగా పోరాడి పార్టీని నిలబెట్టిన గొప్ప వ్యక్తిని గుర్తు చేశారు. ఈయనతో పాటు కుటుంబ సభ్యులు ఇద్దరు కుమారులు హలవత్ చాంప్లా నాయక్,హళవత్ నాగేశ్వరరావు, ఇప్పటికి సిపిఎం పార్టీలోనే కొనసాగుతున్నారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి బిక్షం నాయక్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మతరావు, సిపిఎం మండల కార్యదర్శి తోటకురి రాజశేఖర్, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు శీలం గురుమూర్తి,గన్య నయక్, మండల కమిటీ సభ్యులు హళవత్ నరసింహా, జువాజీ శ్రీను, గురువాయి గూడెం సర్పంచ్ భిక్షం నాయక్ కోకతండ సర్పంచ్ మన్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పాము కాటుకు గురైన బిక్షం నాయక్ కు పరామర్శించిన సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు...

మండలంలోని కోక్యతండ గ్రామంలో ఇటీవల పొలం లో పనిచేస్తుండగా పాముకాటుకు గురై చికిత్స పొంది ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న హలవత్ బిక్షం నాయక్ ను సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మతరావు, సిపిఎం మండల కార్యదర్శి తోటకురి రాజశేఖర్, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు శీలం గురుమూర్తి,గన్య నయక్, మండల కమిటీ సభ్యులు హళవత్ నరసింహా, జువాజీ శ్రీను, గురువాయి గూడెం సర్పంచ్ భిక్షం నాయక్, కోక్య తండ సర్పంచ్ మన్య నాయక్, నందిగామ కృష్ణ, కే కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News