Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల తీర్పు: మత మార్పిడికి అడ్డుకట్ట.. రాజ్యాంగ సవరణ డిమాండ్ గర్జింపు! “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 05:28 PM

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం
March 28, 2026 01:44 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిపిఎం పార్టీ నాయకుడు బైకాని నరసింహ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా నరసింహ సిపిఎం పార్టీకిచ్చిన సేవలను సర్పంచ్ గుర్తు చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయాన్ని నరసింహ కుటుంబానికి అందజేశారు.

భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరసింహ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి లింగయ్య (మాజీ ఉపసర్పంచ్), దండిగ నాగరాజు, కంకణాల శేఖర్ రెడ్డి, గడ్డం యాదగిరి, నాంపల్లి నరసింహ, బెజ్జంకి శంకరాచారి, మేకల లింగయ్య, కల్లూరి శ్రీనివాస్, తోటకూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News