సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం
సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం
Editor Desk
రామన్నపేట: మండలంలోని పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిపిఎం పార్టీ నాయకుడు బైకాని నరసింహ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా నరసింహ సిపిఎం పార్టీకిచ్చిన సేవలను సర్పంచ్ గుర్తు చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయాన్ని నరసింహ కుటుంబానికి అందజేశారు.
భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరసింహ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి లింగయ్య (మాజీ ఉపసర్పంచ్), దండిగ నాగరాజు, కంకణాల శేఖర్ రెడ్డి, గడ్డం యాదగిరి, నాంపల్లి నరసింహ, బెజ్జంకి శంకరాచారి, మేకల లింగయ్య, కల్లూరి శ్రీనివాస్, తోటకూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి