Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:34 AM

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం
28-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిపిఎం పార్టీ నాయకుడు బైకాని నరసింహ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా నరసింహ సిపిఎం పార్టీకిచ్చిన సేవలను సర్పంచ్ గుర్తు చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయాన్ని నరసింహ కుటుంబానికి అందజేశారు.

భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరసింహ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి లింగయ్య (మాజీ ఉపసర్పంచ్), దండిగ నాగరాజు, కంకణాల శేఖర్ రెడ్డి, గడ్డం యాదగిరి, నాంపల్లి నరసింహ, బెజ్జంకి శంకరాచారి, మేకల లింగయ్య, కల్లూరి శ్రీనివాస్, తోటకూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిపిఎం నాయకుడు బైకాని నరసింహ మృతి – గ్రామంలో విషాదం, కుటుంబానికి ఆర్థిక సాయం

Article Image

రామన్నపేట: మండలంలోని పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిపిఎం పార్టీ నాయకుడు బైకాని నరసింహ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా నరసింహ సిపిఎం పార్టీకిచ్చిన సేవలను సర్పంచ్ గుర్తు చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయాన్ని నరసింహ కుటుంబానికి అందజేశారు.

భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరసింహ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి లింగయ్య (మాజీ ఉపసర్పంచ్), దండిగ నాగరాజు, కంకణాల శేఖర్ రెడ్డి, గడ్డం యాదగిరి, నాంపల్లి నరసింహ, బెజ్జంకి శంకరాచారి, మేకల లింగయ్య, కల్లూరి శ్రీనివాస్, తోటకూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News