శంకరంపేట్ మండలంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి
శంకరంపేట్ మండలంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజల వద్దకే పాలన నినాదంతో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మరియు శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.కార్యక్రమంలో కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ప్రజల సమస్యలను ఎదుర్కొని విన్నారు. భూ సమస్యలు, పెన్షన్లు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు,ఇతర అనేక సమస్యలపై ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటిని త్వరగా పరిష్కరించడానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.కలెక్టర్ ఈ సమస్యలను స్థానికంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శంకరంపేట్ మండల ముఖ్య నాయకులు, నూతన సర్పంచ్లు, అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను వ్యక్తం చేయగలిగినందుకు ఇది ఒక మంచి వేదికగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం ప్రజలలో సానుకూల స్పందనను కలిగించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి