Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 13, 2026 06:11 PM

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి
February 19, 2026 10:58 PM 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట పట్టణంలోని శివారు ప్రాంతాల కాలనీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని మానస నగర్‌ (శ్రీ సాయి పట్టణ విస్తరణ ప్రాంతం)లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీల్లో ఎదురవుతున్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతి కాలనీలో సిమెంట్ రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం మరియు ఇతర మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే పట్టణం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కాలనీ ప్రజల సహకారంతో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు కృషి నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News