శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి
శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి
Biksham
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట పట్టణంలోని శివారు ప్రాంతాల కాలనీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని మానస నగర్ (శ్రీ సాయి పట్టణ విస్తరణ ప్రాంతం)లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీల్లో ఎదురవుతున్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతి కాలనీలో సిమెంట్ రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం మరియు ఇతర మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే పట్టణం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కాలనీ ప్రజల సహకారంతో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు కృషి నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి