Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:50 PM

శివరాత్రి వేళ గణపేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు

శివరాత్రి వేళ గణపేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు

శివరాత్రి వేళ గణపేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు
February 15, 2026 06:09 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కుటుంబ సమేతంగా పాల్గొన్న మోదుగు వీరభద్రం

గ్రామ ప్రజల సుఖశాంతుల కోసం హృదయపూర్వక ప్రార్థనలు

కూసుమంచి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గణపేశ్వర స్వామి ఆలయం లో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెరికసింగారం మాజీ ఎంపీటీసీ మోదుగు వీరభద్రం కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఉదయం నుంచే ఆలయంలో పవిత్ర అభిషేకాలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేసి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం మహామంగళహారతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మోదుగు వీరభద్రం గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, పంటల సమృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థించారు. పూజల అనంతరం ఆలయ అర్చకుల నుండి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండి పాల్గొంటూ భక్తి పరంపరను కొనసాగిస్తున్నారని స్థానిక భక్తులు ఆయనను ప్రశంసించారు. పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, క్యూలైన్, ప్రసాదాల పంపిణీ వంటి అన్ని సౌకర్యాలు సమర్థవంతంగా ఏర్పాటు చేశారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది, గ్రామ నాయకులకు అభినందనలు తెలియజేశారు.“సమాజ సేవతో పాటు దైవ సేవ కూడా మన బాధ్యత” అని ఈ సందర్భంగా మోదుగు వీరభద్రం పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News