Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 06:33 PM

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర
April 02, 2026 04:25 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సదాశివపేట పట్టణంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర మార్గాలను పరిశీలించి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే జిల్లా వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో తగిన సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.శోభాయాత్ర నిర్వాహకులు మరియు భక్తులు బాధ్యతతో వ్యవహరించాలని సూచిస్తూ, అధిక శబ్దాలతో డీజేలను వినియోగించకూడదని, ఇతర మతాల భావాలను దెబ్బతీసే విధంగా వివాదాస్పద పాటలు, నినాదాలు, ప్రసంగాలు ఉండకూడదని హెచ్చరించారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సహనంతో ప్రవర్తించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్లు, తప్పుడు ప్రచారాలను నమ్మరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News