Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:57 AM

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర
April 02, 2026 04:25 PM 251 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సదాశివపేట పట్టణంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర మార్గాలను పరిశీలించి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే జిల్లా వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో తగిన సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.శోభాయాత్ర నిర్వాహకులు మరియు భక్తులు బాధ్యతతో వ్యవహరించాలని సూచిస్తూ, అధిక శబ్దాలతో డీజేలను వినియోగించకూడదని, ఇతర మతాల భావాలను దెబ్బతీసే విధంగా వివాదాస్పద పాటలు, నినాదాలు, ప్రసంగాలు ఉండకూడదని హెచ్చరించారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సహనంతో ప్రవర్తించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్లు, తప్పుడు ప్రచారాలను నమ్మరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News