శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర
శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర
Krishna
హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సదాశివపేట పట్టణంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర మార్గాలను పరిశీలించి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే జిల్లా వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో తగిన సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.శోభాయాత్ర నిర్వాహకులు మరియు భక్తులు బాధ్యతతో వ్యవహరించాలని సూచిస్తూ, అధిక శబ్దాలతో డీజేలను వినియోగించకూడదని, ఇతర మతాల భావాలను దెబ్బతీసే విధంగా వివాదాస్పద పాటలు, నినాదాలు, ప్రసంగాలు ఉండకూడదని హెచ్చరించారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సహనంతో ప్రవర్తించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్లు, తప్పుడు ప్రచారాలను నమ్మరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి