Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:49 PM

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర

శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించండి – ఎస్పీ సూచనలు • సదాశివపేటలో శోభాయాత్ర
April 02, 2026 04:25 PM 247 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సదాశివపేట పట్టణంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర మార్గాలను పరిశీలించి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే జిల్లా వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో తగిన సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.శోభాయాత్ర నిర్వాహకులు మరియు భక్తులు బాధ్యతతో వ్యవహరించాలని సూచిస్తూ, అధిక శబ్దాలతో డీజేలను వినియోగించకూడదని, ఇతర మతాల భావాలను దెబ్బతీసే విధంగా వివాదాస్పద పాటలు, నినాదాలు, ప్రసంగాలు ఉండకూడదని హెచ్చరించారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సహనంతో ప్రవర్తించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్లు, తప్పుడు ప్రచారాలను నమ్మరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News