Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:12 PM

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు… 13 రోజుల్లో రూ.5.61 కోట్లు!

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు… 13 రోజుల్లో రూ.5.61 కోట్లు!

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు… 13 రోజుల్లో రూ.5.61 కోట్లు!
February 21, 2026 09:08 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల అనంతరం స్వామి, అమ్మవార్ల హుండీ లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు.

గత 13 రోజులకు గాను స్వామివారికి మొత్తం రూ.5,61,81,535 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. చంద్రవతి కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు అధికారికంగా ఆదాయ వివరాలను ప్రకటించారు.

నగదుతో పాటు భక్తులు బంగారం, వెండి ఆభరణాలను మొక్కుల రూపంలో సమర్పించారు. స్వామి అమ్మవార్లకు 124.5 గ్రాముల బంగారం, 5.550 కేజీల వెండి సమకూరినట్లు అధికారులు తెలిపారు.

భారతీయ కరెన్సీతో పాటు విదేశీ భక్తులు కూడా తమ భక్తిని చాటుకున్నారు. హుండీలో 22 అమెరికా డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, సింగపూర్ డాలర్లు, యూరో కరెన్సీలు లభించినట్లు వెల్లడించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంత నిర్వహణతో పాటు భారీ ఆదాయం రావడం పట్ల దేవస్థానం అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News