Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:42 PM

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు… 13 రోజుల్లో రూ.5.61 కోట్లు!

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు… 13 రోజుల్లో రూ.5.61 కోట్లు!

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు… 13 రోజుల్లో రూ.5.61 కోట్లు!
February 21, 2026 09:08 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల అనంతరం స్వామి, అమ్మవార్ల హుండీ లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు.

గత 13 రోజులకు గాను స్వామివారికి మొత్తం రూ.5,61,81,535 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. చంద్రవతి కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు అధికారికంగా ఆదాయ వివరాలను ప్రకటించారు.

నగదుతో పాటు భక్తులు బంగారం, వెండి ఆభరణాలను మొక్కుల రూపంలో సమర్పించారు. స్వామి అమ్మవార్లకు 124.5 గ్రాముల బంగారం, 5.550 కేజీల వెండి సమకూరినట్లు అధికారులు తెలిపారు.

భారతీయ కరెన్సీతో పాటు విదేశీ భక్తులు కూడా తమ భక్తిని చాటుకున్నారు. హుండీలో 22 అమెరికా డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, సింగపూర్ డాలర్లు, యూరో కరెన్సీలు లభించినట్లు వెల్లడించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంత నిర్వహణతో పాటు భారీ ఆదాయం రావడం పట్ల దేవస్థానం అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News