Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 09:36 PM

శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు, డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం

శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు, డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం

శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు, డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం
April 06, 2026 07:28 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని, తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రవాణా వాహన రంగంలో ఉన్న లారీ యాజమాన్యాలు, డ్రైవర్ల శ్రేయస్సు కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సోమవారం కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో నిర్వహించిన శ్రీ ‘ఆరంభం వెహికల్ లోన్స్’(ఢిల్లీ నుండి దిండిగల్) కార్యక్రమంలో భాగంగా భారీ ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో లారీ డ్రైవర్లు, యాజమాన్యాలు హాజరై సేవలు పొందారు.

ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, డ్రైవర్లు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులు, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ అందిస్తున్న వివిధ రుణ పథకాలు, బీమా సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు డ్రైవర్లకు అవసరమైన సలహాలు అందిస్తూ, సంస్థ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హమ్‌జా హలీ, జోనల్ బిజినెస్ హెడ్ మహిపాల్ రెడ్డి, స్టేట్ హెడ్ ప్రదీప్, రీజనల్ మేనేజర్ రామారావు, బ్రాంచ్ మేనేజర్లు శ్రీనివాస్, శ్రవణ్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News