శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు
శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు
Krishna
ప్రపంచ టేబుల్ టెన్నిస్ రంగంలో భారతదేశానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన బాల మేధావి, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఛాంపియన్షిప్లలో బహుళ టైటిళ్లు సాధించి దేశ గౌరవాన్ని పెంచిన ప్రముఖ భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ను శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి బోరంచ గ్రామంలో భక్తి వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఏడు వారాల మహోత్సవ మహా జాతరకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, భక్తుల భాగస్వామ్యంతో జరిగే పూజా కార్యక్రమాల గురించి వివరించి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరగా, నైనా జైస్వాల్ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి ఆలయ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి