శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో డ్రగ్రహిత తెలంగాణ ప్రతిజ్ఞ. విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ శాఖ చొరవ
శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో డ్రగ్రహిత తెలంగాణ ప్రతిజ్ఞ. విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ శాఖ చొరవ
Editor Desk
శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన డ్రగ్రహిత తెలంగాణ కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపింది. మాదకద్రవ్యాల ముప్పు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రిన్సిపల్ భాస్కరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినట్లు చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ క్రియాశీలంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పూర్తి అవగాహనతో ఉండి, తమతో పాటు ఇతరులను కూడా ఈ వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. డ్రగ్స్ అమ్మకం–కొనుగోలు చేసే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేస్తామని, డ్రగ్రహిత జీవనశైలిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
డ్రగ్రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములమవుతామని విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆప్కారి ఎస్సై శంకర్, శివకృష్ణ, సిబ్బంది అనిల్ కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి