Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర మానవసేవే మాధవసేవ ఖేడ్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర్ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 06:00 PM

శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో డ్రగ్‌రహిత తెలంగాణ ప్రతిజ్ఞ. విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ శాఖ చొరవ

శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో డ్రగ్‌రహిత తెలంగాణ ప్రతిజ్ఞ. విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ శాఖ చొరవ

శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో డ్రగ్‌రహిత తెలంగాణ ప్రతిజ్ఞ.  విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ శాఖ చొరవ
March 28, 2026 02:07 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన డ్రగ్‌రహిత తెలంగాణ కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపింది. మాదకద్రవ్యాల ముప్పు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రిన్సిపల్ భాస్కరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినట్లు చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ క్రియాశీలంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పూర్తి అవగాహనతో ఉండి, తమతో పాటు ఇతరులను కూడా ఈ వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. డ్రగ్స్ అమ్మకం–కొనుగోలు చేసే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేస్తామని, డ్రగ్‌రహిత జీవనశైలిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

డ్రగ్‌రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములమవుతామని విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆప్కారి ఎస్సై శంకర్, శివకృష్ణ, సిబ్బంది అనిల్ కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News