శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం సందర్శించిన నూతన మున్సిపల్ పాలకవర్గం
శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం సందర్శించిన నూతన మున్సిపల్ పాలకవర్గం
Biksham
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం – అభివృద్ధికి కృషి చేస్తానన్న చైర్పర్సన్
సూర్యాపేట:
పట్టణాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి బుధవారం శ్రీ శబరినగర్ అయ్యప్పస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్పర్సన్ నివేదిత లక్షాధి, వైస్ చైర్మన్ షఫి, కౌన్సిలర్లు గుణగంటి హేమ–సతీష్, రాపర్తి భవాని–శ్రీనివాస్, నాయకులు ఫారూఖ్, బైరబోయిన శ్రీనివాస్, బత్తుల రమేష్లను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జాతీయ రహదారి ప్రక్కన ఉన్న శ్రీ శబరినగర్ అయ్యప్పస్వామి దేవాలయ అభివృద్ధికి మున్సిపాలిటీ సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా చైర్పర్సన్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బెలిదె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎల్గూరి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, కమిటీ సభ్యులు మనసాని రామ్మూర్తి, మనసాని నాగేశ్వరరావు, వేమిశెట్టి మధు, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, జటంగి రవి, పోలా రాధాకృష్ణ, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి