Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 05:56 AM

శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం సందర్శించిన నూతన మున్సిపల్ పాలకవర్గం

శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం సందర్శించిన నూతన మున్సిపల్ పాలకవర్గం

శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం సందర్శించిన నూతన మున్సిపల్ పాలకవర్గం
February 18, 2026 05:03 PM 178 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం – అభివృద్ధికి కృషి చేస్తానన్న చైర్పర్సన్

సూర్యాపేట:

పట్టణాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి బుధవారం శ్రీ శబరినగర్ అయ్యప్పస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్పర్సన్ నివేదిత లక్షాధి, వైస్ చైర్మన్ షఫి, కౌన్సిలర్లు గుణగంటి హేమ–సతీష్, రాపర్తి భవాని–శ్రీనివాస్, నాయకులు ఫారూఖ్, బైరబోయిన శ్రీనివాస్, బత్తుల రమేష్‌లను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జాతీయ రహదారి ప్రక్కన ఉన్న శ్రీ శబరినగర్ అయ్యప్పస్వామి దేవాలయ అభివృద్ధికి మున్సిపాలిటీ సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా చైర్పర్సన్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బెలిదె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎల్గూరి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, కమిటీ సభ్యులు మనసాని రామ్మూర్తి, మనసాని నాగేశ్వరరావు, వేమిశెట్టి మధు, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, జటంగి రవి, పోలా రాధాకృష్ణ, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News