Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు: ఎస్ఎఫ్ఐ ఆగ్రహం స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 08:35 PM

శానిటేషన్ లోపాలపై అదనపు కలెక్టర్ ఆగ్రహం…

శానిటేషన్ లోపాలపై అదనపు కలెక్టర్ ఆగ్రహం…

శానిటేషన్ లోపాలపై అదనపు కలెక్టర్ ఆగ్రహం…
March 25, 2026 06:01 PM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంట్రాక్టర్‌కు బ్లాక్‌లిస్ట్ హెచ్చరిక

పద్ధతి మార్చుకుని పనులు నిర్వహించకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు దవాఖాన శానిటేషన్ కాంట్రాక్టర్‌ను తీవ్రంగా హెచ్చరించారు.

బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన ఆయన, శానిటేషన్ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్‌కు ఫోన్‌లోనే తీవ్రంగా హెచ్చరించారు. రెండు రోజుల్లో దవాఖాన సూపరింటెండెంట్ సూచనల మేరకు పనులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. లేని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేసి కాంట్రాక్ట్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేశారు.

వైద్యులు, సిబ్బంది డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని డీసీహెచ్‌ఎస్‌ను ఫోన్‌లో ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించడం, డ్రైనేజీ పనులు చేపట్టాలని ఎంపీడీఓ ఆవుల రాములును ఆదేశించారు.ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ శ్వేత ప్రియాంక, ఏపీఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News