Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:27 AM

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ
23-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

శాఖాహారం, అహింస, ధ్యానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ నల్లగొండ పట్టణంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సదానంద పిరమిడ్, శ్రీ గణేష్ పిరమిడ్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బోయవాడ ధ్యాన కేంద్రం నుంచి ఈ ర్యాలీ జరిగింది.

ఈ సందర్భంగా దామోదర్ మహాస్వామి, కడ్తాల్ పిరమిడ్ ట్రస్ట్ ప్రతినిధులు, భూపతిరాజు, భూసాని జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అహింసా మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాఖాహారాన్ని అలవాటు చేసుకొని జీవహింసకు దూరంగా ఉండాలని సూచించారు.

ధ్యాన సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, బీపీ, షుగర్, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. ధ్యానం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాగర్ సతీష్‌బాబు, శివకుమార్‌తో పాటు పీఎంసీ కుటుంబ సభ్యులు, ధ్యాన సాధకులు పాల్గొన్నారు.

Sthanikam

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ

Article Image

నల్లగొండ,

శాఖాహారం, అహింస, ధ్యానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ నల్లగొండ పట్టణంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సదానంద పిరమిడ్, శ్రీ గణేష్ పిరమిడ్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బోయవాడ ధ్యాన కేంద్రం నుంచి ఈ ర్యాలీ జరిగింది.

ఈ సందర్భంగా దామోదర్ మహాస్వామి, కడ్తాల్ పిరమిడ్ ట్రస్ట్ ప్రతినిధులు, భూపతిరాజు, భూసాని జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అహింసా మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాఖాహారాన్ని అలవాటు చేసుకొని జీవహింసకు దూరంగా ఉండాలని సూచించారు.

ధ్యాన సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, బీపీ, షుగర్, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. ధ్యానం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాగర్ సతీష్‌బాబు, శివకుమార్‌తో పాటు పీఎంసీ కుటుంబ సభ్యులు, ధ్యాన సాధకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News