Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:38 PM

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ

శాఖాహారం–ధ్యానం సందేశంతో నల్లగొండలో ర్యాలీ
March 23, 2026 08:42 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

శాఖాహారం, అహింస, ధ్యానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ నల్లగొండ పట్టణంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సదానంద పిరమిడ్, శ్రీ గణేష్ పిరమిడ్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బోయవాడ ధ్యాన కేంద్రం నుంచి ఈ ర్యాలీ జరిగింది.

ఈ సందర్భంగా దామోదర్ మహాస్వామి, కడ్తాల్ పిరమిడ్ ట్రస్ట్ ప్రతినిధులు, భూపతిరాజు, భూసాని జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అహింసా మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాఖాహారాన్ని అలవాటు చేసుకొని జీవహింసకు దూరంగా ఉండాలని సూచించారు.

ధ్యాన సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, బీపీ, షుగర్, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. ధ్యానం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాగర్ సతీష్‌బాబు, శివకుమార్‌తో పాటు పీఎంసీ కుటుంబ సభ్యులు, ధ్యాన సాధకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News