సీవీ రామన్ స్ఫూర్తితో శాస్త్ర పరిశోధనల్లో రాణించాలి
సీవీ రామన్ స్ఫూర్తితో శాస్త్ర పరిశోధనల్లో రాణించాలి
Biksham
విద్యార్థులు సాంకేతికతతో ముందుకు సాగాలి : చైర్మన్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు సీవీ రామన్ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణించి కొత్త ఆవిష్కరణలకు ముందుకు రావాలని చైర్మన్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ఉన్న సిటీ టాలెంట్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞానోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శాస్త్ర ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు విజ్ఞానశాస్త్ర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శాస్త్ర పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎలైట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి కిరణ్ కుమార్, సిటీ టాలెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీధర్, న్యూ విజన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుకృత రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి