శ్రీరామనవమి వసంత నవరాత్రుల సందర్భంగా 8వ రోజు సీతారామచంద్ర స్వామివారికి మంగళస్నానం, పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆనంద్బాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కార్యనిర్వాహణాధికారి ఏ.బి. రవీంద్ర రెడ్డి పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు డా. తులసి వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, హనుమంతునికి విశేష అలంకరణ చేశారు.
మహిళా భక్తురాళ్ల ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మాజీ సభ్యులు, మహిళా భక్తులు మరియు భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి