రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో మౌళిక వసతుల అభివృద్ధి దిశగా
శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుండి కాల్య శంకరయ్య ఇంటి వరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌళిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు అందించడం లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పవన్ కుమార్, వార్డు సభ్యులు ముక్కాముల సతీష్, చిత్రకంటి సునీత, జంగిలి రమణ, కంచి కుమారస్వామి, కంచి స్వామి, దేశోజు శ్రీనివాసచారి, గంగదారి పద్మతో పాటు వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి