సీనియర్ జర్నలిస్టు బొజ్జ ఎడ్వర్డ్కు పరామర్శ
సీనియర్ జర్నలిస్టు బొజ్జ ఎడ్వర్డ్కు పరామర్శ
Biksham
ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర జర్నలిస్టుల సంఘం నాయకులు
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బొజ్జ ఎడ్వర్డ్ అనారోగ్యంతో చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘం నాయకులు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. హృదయ సంబంధిత సమస్యతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందిన ఎడ్వర్డ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎడ్వర్డ్ను పరామర్శించిన వారిలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుస్సా చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్, నియోజకవర్గ కమిటీ సభ్యులు సందీప్, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి