Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:37 AM

సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం

సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం

 సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం
February 24, 2026 07:07 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బీడుపల్లిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో జనగణన (Census) – 2027 ప్రక్రియపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ , డీఆర్వో ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది. జిల్లాలోని ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్ఓఏలు, టీపీఓలు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు.రాబోయే జనగణనను పకడ్బందీగా నిర్వహించడం, డేటా సేకరణలో సాంకేతికత వినియోగం మరియు క్షేత్రస్థాయి విధుల్లో తప్పులు దొర్లకుండా అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో డేటా సేకరణ అత్యంత కీలకమని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News