Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం

సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం

 సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం
February 24, 2026 07:07 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బీడుపల్లిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో జనగణన (Census) – 2027 ప్రక్రియపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ , డీఆర్వో ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది. జిల్లాలోని ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్ఓఏలు, టీపీఓలు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు.రాబోయే జనగణనను పకడ్బందీగా నిర్వహించడం, డేటా సేకరణలో సాంకేతికత వినియోగం మరియు క్షేత్రస్థాయి విధుల్లో తప్పులు దొర్లకుండా అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో డేటా సేకరణ అత్యంత కీలకమని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News