Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:36 PM

సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం

సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం

 సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం
24-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బీడుపల్లిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో జనగణన (Census) – 2027 ప్రక్రియపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ , డీఆర్వో ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది. జిల్లాలోని ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్ఓఏలు, టీపీఓలు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు.రాబోయే జనగణనను పకడ్బందీగా నిర్వహించడం, డేటా సేకరణలో సాంకేతికత వినియోగం మరియు క్షేత్రస్థాయి విధుల్లో తప్పులు దొర్లకుండా అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో డేటా సేకరణ అత్యంత కీలకమని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

Sthanikam

సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బీడుపల్లిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో జనగణన (Census) – 2027 ప్రక్రియపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ , డీఆర్వో ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది. జిల్లాలోని ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్ఓఏలు, టీపీఓలు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు.రాబోయే జనగణనను పకడ్బందీగా నిర్వహించడం, డేటా సేకరణలో సాంకేతికత వినియోగం మరియు క్షేత్రస్థాయి విధుల్లో తప్పులు దొర్లకుండా అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో డేటా సేకరణ అత్యంత కీలకమని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News