సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం
సెన్సెస్ -2027 పై శిక్షణ కార్యక్రమం
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బీడుపల్లిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో జనగణన (Census) – 2027 ప్రక్రియపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ , డీఆర్వో ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది. జిల్లాలోని ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్ఓఏలు, టీపీఓలు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు.రాబోయే జనగణనను పకడ్బందీగా నిర్వహించడం, డేటా సేకరణలో సాంకేతికత వినియోగం మరియు క్షేత్రస్థాయి విధుల్లో తప్పులు దొర్లకుండా అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో డేటా సేకరణ అత్యంత కీలకమని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి