సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Biksham
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు కేతావత్ శంకర్ నాయక్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీకి చెందిన కలకోట్ల అఖిలకు రూ.50 వేల చెక్కును, సూర్యాపేట మండలం సపవత్ తండాకు చెందిన దేపవత్ రవీందర్ నాయక్కు రూ.29 వేల చెక్కును, సూర్యాపేట పట్టణంలోని 39వ వార్డు బొడ్రాయి బజార్కు చెందిన దేవరకొండ విజయకు రూ.28 వేల చెక్కును అందజేశారు.
ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి లబ్ధిదారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో పాటు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి