Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 24, 2026 12:42 PM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య
March 24, 2026 10:34 AM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీసీ రక్షణ చట్టం, సమస్యల పరిష్కారంపై వినతి

హైదరాబాద్, ప్రతినిధి:

రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సోమవారం అసెంబ్లీ సీఎంవారి చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రైతాంగ సమస్యల పరిష్కారంపై కూడా సీఎం దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో నీలా వెంకటేష్, జిల్లపెల్లి అంజి, పగిళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News