సాయి నామ శతకోటి మహాయజ్ఞం ముగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
సాయి నామ శతకోటి మహాయజ్ఞం ముగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
స్థానికం బృందం
దిల్సుఖ్నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి నామ శతకోటి మహాయజ్ఞం అనేది భక్తులు సాయిబాబా నామాన్ని కోటి సార్లు జపిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకునే మహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. ఇటువంటి యజ్ఞాలు సమాజంలో శాంతి, సౌహార్దత, భక్తి భావాలను పెంపొందిస్తాయని తెలిపారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను అందించడమే కాకుండా సమాజాన్ని ధర్మమార్గంలో నడిపించేందుకు దోహదపడతాయని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందదాయకమని అభినందించారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి