Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 12:28 AM

సాయి నామ శతకోటి మహాయజ్ఞం ముగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

సాయి నామ శతకోటి మహాయజ్ఞం ముగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

సాయి నామ శతకోటి మహాయజ్ఞం ముగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
February 26, 2026 04:42 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దిల్‌సుఖ్‌నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి నామ శతకోటి మహాయజ్ఞం అనేది భక్తులు సాయిబాబా నామాన్ని కోటి సార్లు జపిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకునే మహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. ఇటువంటి యజ్ఞాలు సమాజంలో శాంతి, సౌహార్దత, భక్తి భావాలను పెంపొందిస్తాయని తెలిపారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను అందించడమే కాకుండా సమాజాన్ని ధర్మమార్గంలో నడిపించేందుకు దోహదపడతాయని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందదాయకమని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News