Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:24 PM

స్వీయ గణనకు నేటి నుంచి అవకాశం

స్వీయ గణనకు నేటి నుంచి అవకాశం

స్వీయ గణనకు నేటి నుంచి అవకాశం
April 26, 2026 06:54 PM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జనగణన–2027లో భాగంగా స్వీయ గణనకు నేటి నుంచి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేయాలని సూచించారు.

ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముద్రిత, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీయ గణన ప్రక్రియపై వివరాలు తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన ప్రక్రియ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, సౌకర్యాలు తదితర అంశాలను అధికారిక వెబ్ ద్వారం ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు.

ఈసారి జనగణనలో తొలిసారిగా స్వీయ గణనను ప్రవేశపెట్టడం జరిగిందని, ఇది దేశాన్ని డిజిటల్ దిశగా ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.

స్వీయ గణన ద్వారా కుటుంబాలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. ఈ ప్రక్రియ మొబైల్ సంఖ్య, గుర్తింపు సంకేతం ఆధారంగా సురక్షితంగా జరుగుతుందని తెలిపారు. గృహస్థులు తమ నివాస ప్రాంతాన్ని రాష్ట్రం, జిల్లా, గ్రామం లేదా పట్టణం ప్రకారం ఎంపిక చేసి పటంలో ఖచ్చితంగా గుర్తించాలన్నారు.

అడిగే ప్రశ్నలు సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటాయని, అవసరమైన మార్గదర్శక సమాచారం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. వివరాలు పూర్తిగా నమోదు చేసిన అనంతరం ప్రత్యేక గుర్తింపు సంఖ్య సందేశంగా అందుతుందని తెలిపారు.

స్వీయ గణన చేసినప్పటికీ ఎన్యూమరేటర్ గృహ సందర్శన తప్పనిసరి అని, వారు గుర్తింపు సంఖ్యను సేకరించి వివరాలను పరిశీలించి అవసరమైతే సవరణలు చేసి తుది సమర్పణ చేస్తారని తెలిపారు. స్వీయ గణన చేయని కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్ స్వయంగా నమోదు చేస్తారని పేర్కొన్నారు.

ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశంలోనే వివరాలు నమోదు చేయాలని, పటంలో స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించాలని సూచించారు. ఒక మొబైల్ సంఖ్యతో ఒకే కుటుంబాన్ని నమోదు చేయాలని, తుది సమర్పణకు ముందు వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. తప్పు సమాచారం ఇస్తే వివరాలు సరిపోలకపోవచ్చని హెచ్చరించారు.

సమర్పణ అనంతరం లభించే గుర్తింపు సంఖ్యను భద్రపరచుకోవాలని తెలిపారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేయడం ద్వారా ఖచ్చితమైన జనగణన సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబం తప్పనిసరిగా స్వీయ గణనలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, ఇస్లావత్ ఓబులాలు, వి రామారావు, ఎం రాజేష్, దున్న శ్యామ్ తదితరులు, మాధ్యమాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News