Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:03 AM

స్వీయ గణన ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి: కలెక్టర్ ప్రతీక్ జైన్

స్వీయ గణన ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి: కలెక్టర్ ప్రతీక్ జైన్

స్వీయ గణన ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి: కలెక్టర్ ప్రతీక్ జైన్
03-05-2026 178 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) విధానం ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని, జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు సమాచార ఖచ్చితత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం https://se.census.gov.in⁠ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్, ఓటీపీ ధృవీకరణ అనంతరం జిల్లా, గ్రామం/పట్టణం, పిన్ కోడ్, లొకేషన్ వివరాలు నమోదు చేసి ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయాలని తెలిపారు. సబ్మిట్ చేసిన తర్వాత లభించే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడిని భద్రపరచుకోవాలని, మే 11 తర్వాత గణనాధికారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపించి ధృవీకరణ పొందవచ్చని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

స్వీయ గణన ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి: కలెక్టర్ ప్రతీక్ జైన్

Article Image

జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) విధానం ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని, జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు సమాచార ఖచ్చితత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం https://se.census.gov.in⁠ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్, ఓటీపీ ధృవీకరణ అనంతరం జిల్లా, గ్రామం/పట్టణం, పిన్ కోడ్, లొకేషన్ వివరాలు నమోదు చేసి ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయాలని తెలిపారు. సబ్మిట్ చేసిన తర్వాత లభించే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడిని భద్రపరచుకోవాలని, మే 11 తర్వాత గణనాధికారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపించి ధృవీకరణ పొందవచ్చని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News