స్వీయ గణన ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి: కలెక్టర్ ప్రతీక్ జైన్
స్వీయ గణన ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి: కలెక్టర్ ప్రతీక్ జైన్
Krishna
జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) విధానం ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని, జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు సమాచార ఖచ్చితత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం https://se.census.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్, ఓటీపీ ధృవీకరణ అనంతరం జిల్లా, గ్రామం/పట్టణం, పిన్ కోడ్, లొకేషన్ వివరాలు నమోదు చేసి ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయాలని తెలిపారు. సబ్మిట్ చేసిన తర్వాత లభించే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడిని భద్రపరచుకోవాలని, మే 11 తర్వాత గణనాధికారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపించి ధృవీకరణ పొందవచ్చని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి