Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:01 AM

స్వయం సహాయక సంఘాల మహిళలకు న్యాయం చేయాలి: బీజేపీ నిరసన

స్వయం సహాయక సంఘాల మహిళలకు న్యాయం చేయాలి: బీజేపీ నిరసన

స్వయం సహాయక సంఘాల మహిళలకు న్యాయం చేయాలి: బీజేపీ నిరసన
March 24, 2026 07:05 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి పట్టణంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం నేతృత్వంలో బాధిత మహిళలతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, మహిళలకు అందాల్సిన ఆర్థిక సాయం, రుణ సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందకపోవడానికి స్థానిక అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

తక్షణమే సమస్యలను పరిష్కరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను వెంటనే అందజేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పాదారాజు ఉమా శంకర్ రావు, జిల్లా కార్యదర్శులు మేడి కోటేష్, వైజయంతి, కౌన్సిలర్లు వంగెటి సుచరిత, బండారు స్వర్ణలత, తుమ్మల యాస్మిన్ నగేష్, మాజీ కౌన్సిలర్లు నల్లమాస సుమ వెంకటేష్, జనగాం కవిత, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి కృష్ణచారి,ఉడుత భాస్కర్, మంగు నర్సింహ,పట్టణ ఉపాధ్యక్షుడు యట వెంకటేష్, కొల్లోజు సతీష్,ఇండ్ల సత్యలక్ష్మి, కొలిచిలిమ మల్లికార్జున్, కానుకుంట్ల రమేష్, ఉషా కిరణ్, దాసరి స్వామి, తాడూరి రాజ్ కుమార్, ఎరుపుల శివ,వాస నర్సింగ్ రావు, అందే విజయ్, కారుపాటి రాజు, గాయపాక పృద్వి, పట్నం కిట్టు, రావుల సంతోష్, జర్రిపోతుల భరత్, మామిడాల పవన్,కోళ్ల సుధాకర్,బండారు శివశంకర్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News