స్వయం సహాయక సంఘాల మహిళలకు న్యాయం చేయాలి: బీజేపీ నిరసన
స్వయం సహాయక సంఘాల మహిళలకు న్యాయం చేయాలి: బీజేపీ నిరసన
Editor Desk
యాదాద్రి భువనగిరి పట్టణంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం నేతృత్వంలో బాధిత మహిళలతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, మహిళలకు అందాల్సిన ఆర్థిక సాయం, రుణ సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందకపోవడానికి స్థానిక అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
తక్షణమే సమస్యలను పరిష్కరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను వెంటనే అందజేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాదారాజు ఉమా శంకర్ రావు, జిల్లా కార్యదర్శులు మేడి కోటేష్, వైజయంతి, కౌన్సిలర్లు వంగెటి సుచరిత, బండారు స్వర్ణలత, తుమ్మల యాస్మిన్ నగేష్, మాజీ కౌన్సిలర్లు నల్లమాస సుమ వెంకటేష్, జనగాం కవిత, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి కృష్ణచారి,ఉడుత భాస్కర్, మంగు నర్సింహ,పట్టణ ఉపాధ్యక్షుడు యట వెంకటేష్, కొల్లోజు సతీష్,ఇండ్ల సత్యలక్ష్మి, కొలిచిలిమ మల్లికార్జున్, కానుకుంట్ల రమేష్, ఉషా కిరణ్, దాసరి స్వామి, తాడూరి రాజ్ కుమార్, ఎరుపుల శివ,వాస నర్సింగ్ రావు, అందే విజయ్, కారుపాటి రాజు, గాయపాక పృద్వి, పట్నం కిట్టు, రావుల సంతోష్, జర్రిపోతుల భరత్, మామిడాల పవన్,కోళ్ల సుధాకర్,బండారు శివశంకర్, తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి