భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్లకు ఘన నివాళులు
హైదరాబాద్,
దేశ స్వాతంత్ర్య సమరయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని గాంధీభవన్లో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్కతో కలిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తి దేశ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసి, చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుల సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి