స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా
స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా
Biksham Goud
విద్యార్థులు వివిధ అధికారుల పాత్రల్లో ఆకట్టుకున్నారు
సూర్యాపేట టౌన్:
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఎస్విఎన్ పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, పోలీస్ ఉన్నతాధికారులుగా, విద్యాధికారులుగా, ఉపాధ్యాయులుగా వివిధ పాత్రలు పోషిస్తూ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. వారి ప్రతిభకు హాజరైనవారు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. జగన్మోహన్ మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తేనే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని అన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారం అని తెలిపారు. జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా విద్యతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అనంతరం వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షీల్డులు, బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహణాధికారి అనిత, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి, సుధా, జగదీశ్వరి, మౌనిక, పద్మలత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి