Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:01 AM

స్వచ్ఛ నారాయణఖేడ్‌కు ప్రజల సహకారం అవసరం : మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి

స్వచ్ఛ నారాయణఖేడ్‌కు ప్రజల సహకారం అవసరం : మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి

స్వచ్ఛ నారాయణఖేడ్‌కు ప్రజల సహకారం అవసరం : మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి
18-05-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో సోమవారం నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. చెత్తను రోడ్లపై వేయడం, డ్రైనేజీల్లో వ్యర్థాలు పడేయడం వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వచ్ఛ నారాయణఖేడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ, నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేస్తే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వి ప్రశాంతి స్పష్టం చేశారు.

Sthanikam

స్వచ్ఛ నారాయణఖేడ్‌కు ప్రజల సహకారం అవసరం : మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో సోమవారం నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ వి ప్రశాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. చెత్తను రోడ్లపై వేయడం, డ్రైనేజీల్లో వ్యర్థాలు పడేయడం వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వచ్ఛ నారాయణఖేడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ, నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేస్తే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వి ప్రశాంతి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News