సోమందేపల్లి: సోమందేపల్లి లోని జామియా మసీదులో రంజాన్ మాసపు 10వ ఉపవాస దినాన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా మౌలానా అబ్దుల్ ఇలియాజ్ ఉదయం నమాజ్ నిర్వహించి భక్తులకు సందేశం ఇచ్చారు.
మౌలానా మాట్లాడుతూ ప్రతి మనిషిలో దైవ చింతన, పశ్చాత్తాపం ఉండాలని తెలిపారు. ఎంతటి కష్ట పరిస్థితులు వచ్చినా అబద్ధాలు చెప్పకూడదని, సత్యమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ నీతి మార్గంలో నడవాలని సూచించారు.
అలాగే సర్వ మతాలను, కులాలను గౌరవించడం ఇస్లాం మతం యొక్క అసలు సారాంశమని వివరించారు. అనంతరం ఉపవాసానికి సంబంధించిన శ్లోకాన్ని చదివించి దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి