Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:05 PM

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్
February 28, 2026 12:38 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: సోమందేపల్లి లోని జామియా మసీదులో రంజాన్ మాసపు 10వ ఉపవాస దినాన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా మౌలానా అబ్దుల్ ఇలియాజ్ ఉదయం నమాజ్ నిర్వహించి భక్తులకు సందేశం ఇచ్చారు.

మౌలానా మాట్లాడుతూ ప్రతి మనిషిలో దైవ చింతన, పశ్చాత్తాపం ఉండాలని తెలిపారు. ఎంతటి కష్ట పరిస్థితులు వచ్చినా అబద్ధాలు చెప్పకూడదని, సత్యమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నీతి మార్గంలో నడవాలని సూచించారు.

అలాగే సర్వ మతాలను, కులాలను గౌరవించడం ఇస్లాం మతం యొక్క అసలు సారాంశమని వివరించారు. అనంతరం ఉపవాసానికి సంబంధించిన శ్లోకాన్ని చదివించి దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News