Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:55 PM

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సొంత నిధులతో సేవా కార్యక్రమం

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సొంత నిధులతో సేవా కార్యక్రమం

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సొంత నిధులతో సేవా కార్యక్రమం
March 19, 2026 06:10 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-తాజ్‌పూర్‌లో 120 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్‌పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. సుమారు 120 కుటుంబాలకు ఈ తోఫాలు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పేద ముస్లిం కుటుంబాలు అధికంగా ఉండటంతో వారు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఏ వర్గానికి చెందిన వారికైనా ఆపద వచ్చినప్పుడు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తమ సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగేదని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ తోఫా అందకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు.అదేవిధంగా,గ్రామంలోని ఓ ముస్లిం మహిళకు నివాసం లేకపోవడంతో దాదాపు లక్ష రూపాయలతో గృహ నిర్మాణం చేసి రంజాన్ రోజున గృహప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ,వార్డు సభ్యులు,బీఆర్‌ఎస్ నాయకులు,ముస్లిం నాయకులు,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News