Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 19, 2026 08:02 PM

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సొంత నిధులతో సేవా కార్యక్రమం

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సొంత నిధులతో సేవా కార్యక్రమం

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సొంత నిధులతో సేవా కార్యక్రమం
March 19, 2026 06:10 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-తాజ్‌పూర్‌లో 120 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్‌పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. సుమారు 120 కుటుంబాలకు ఈ తోఫాలు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పేద ముస్లిం కుటుంబాలు అధికంగా ఉండటంతో వారు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఏ వర్గానికి చెందిన వారికైనా ఆపద వచ్చినప్పుడు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తమ సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగేదని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ తోఫా అందకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు.అదేవిధంగా,గ్రామంలోని ఓ ముస్లిం మహిళకు నివాసం లేకపోవడంతో దాదాపు లక్ష రూపాయలతో గృహ నిర్మాణం చేసి రంజాన్ రోజున గృహప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ,వార్డు సభ్యులు,బీఆర్‌ఎస్ నాయకులు,ముస్లిం నాయకులు,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News