సర్పంచ్ గరిక సత్యనారాయణ – కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ విజేతలకు ఘన సన్మానం
సర్పంచ్ గరిక సత్యనారాయణ – కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ విజేతలకు ఘన సన్మానం
Editor Desk
రామన్నపేట పట్టణంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకు గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ మరియు రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎం.ఎ. మజీద్, ఉపాధ్యక్షుడిగా బాలరాజు, జనరల్ సెక్రటరీగా యాదాసు యాదయ్య ఎన్నిక కావడం పట్ల వారు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా విజేతలకు శాలువాలు కప్పి, పూలదండలు వేసి సత్కరించారు. సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, నూతన బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటె రమేష్, మాజీ సర్పంచ్ గోదాసు పృథ్విరాజ్, డీసీసీబీ డైరెక్టర్ జెల్ల వెంకటేశం, మాజీ ఎంపీటీసీలు సాలివేరు అశోక్, వనం చంద్రశేఖర్, వార్డు సభ్యులు అబ్దుల్ వాహిద్ మహమ్మద్ (అంజాద్), కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, సుదర్శన్, కందుల సాయి, గొరిగే శేఖర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండీ నిజాముద్దీన్, సీనియర్ నాయకులు ఎండీ నాసర్, మైనారిటీ నాయకులు ఎండీ తాహిర్, గొలుసుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి