Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:14 AM

సర్పంచ్ గరిక సత్యనారాయణ – కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ విజేతలకు ఘన సన్మానం

సర్పంచ్ గరిక సత్యనారాయణ – కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ విజేతలకు ఘన సన్మానం

సర్పంచ్ గరిక సత్యనారాయణ – కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ విజేతలకు ఘన సన్మానం
March 28, 2026 08:19 PM 275 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకు గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ మరియు రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎం.ఎ. మజీద్, ఉపాధ్యక్షుడిగా బాలరాజు, జనరల్ సెక్రటరీగా యాదాసు యాదయ్య ఎన్నిక కావడం పట్ల వారు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా విజేతలకు శాలువాలు కప్పి, పూలదండలు వేసి సత్కరించారు. సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, నూతన బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటె రమేష్, మాజీ సర్పంచ్ గోదాసు పృథ్విరాజ్, డీసీసీబీ డైరెక్టర్ జెల్ల వెంకటేశం, మాజీ ఎంపీటీసీలు సాలివేరు అశోక్, వనం చంద్రశేఖర్, వార్డు సభ్యులు అబ్దుల్ వాహిద్ మహమ్మద్ (అంజాద్), కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, సుదర్శన్, కందుల సాయి, గొరిగే శేఖర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండీ నిజాముద్దీన్, సీనియర్ నాయకులు ఎండీ నాసర్, మైనారిటీ నాయకులు ఎండీ తాహిర్, గొలుసుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News