Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:40 PM

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు
December 18, 2025 05:55 AM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఫైరింగ్!
జగిత్యాల స్థానిక ప్రతినిధి
  1. జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీఆర్‌ఎస్ మద్దతుదారు మంగ సర్పంచ్‌గా గెలుపొందగా, బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు.
  2. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది.
  3. ఉద్రిక్తతను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భద్రతా చర్యల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
  4. పరిస్థితిపై అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News