PRINT TIME: February 23, 2026 11:40 PM
సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు
సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు
December 18, 2025 05:55 AM
52 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఫైరింగ్!
జగిత్యాల స్థానిక ప్రతినిధి
- జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీఆర్ఎస్ మద్దతుదారు మంగ సర్పంచ్గా గెలుపొందగా, బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్కు డిమాండ్ చేశారు.
- కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది.
- ఉద్రిక్తతను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్కు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భద్రతా చర్యల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
- పరిస్థితిపై అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి