సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి చొరవతో జనంపల్లి నాలుగో వార్డుకు నల్లా నీటి శాశ్వత పరిష్కారం
సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి చొరవతో జనంపల్లి నాలుగో వార్డుకు నల్లా నీటి శాశ్వత పరిష్కారం
Editor Desk
పార్టీలకు అతీతంగా జనంపల్లి అభివృద్ధి
రామన్నపేట స్థానికం ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మౌలిక వసతుల సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రామంలోని నాలుగో వార్డులో పైప్లైన్ రిపేర్ సమస్య కారణంగా గత రెండేళ్లుగా నల్లా నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై స్పందించిన గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి ఆధ్వర్యంలో పాత, దెబ్బతిన్న పైప్లైన్ను తొలగించి నూతన పైప్లైన్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయ్యాక నాలుగో వార్డుకు నిరంతరంగా నల్లా నీరు అందిస్తామని సర్పంచ్ తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని, దశలవారీగా అన్ని వార్డుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పైప్లైన్ పనులు వేగంగా సాగుతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి