Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:19 AM

స్పష్టమైన దృష్టి లేకపోతే జీవితంలో పనులు కష్టతరం

స్పష్టమైన దృష్టి లేకపోతే జీవితంలో పనులు కష్టతరం

స్పష్టమైన దృష్టి లేకపోతే జీవితంలో పనులు కష్టతరం
February 26, 2026 07:12 PM 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కంటి, మధుమేహ, రక్తపోటు పరీక్షల ఉచిత శిబిరం

మానవ శరీరంలో అత్యంత సున్నితమైన, విలువైన అవయవాలలో నేత్రం అని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల్ అధ్యక్షుడు తిరందాసు జగన్నానాథం అన్నారు. స్పష్టమైన దృష్టి లేకపోతే జీవనలో అనేక పనులు కష్టతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు.పురపాలిక కేంద్రంలోని వలిగొండ రోడ్డులోని లయన్స్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ట్రాఫిక్ పోలీస్ సహకారంతో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, మధుమేహ, రక్తపోటు పరీక్షల శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరాన్ని ట్రాఫిక్ సీఐ విజయ్ మోహన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.కంటి నిపుణులు గుంటోజు సంధ్యారాణి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు.పుర ప్రజలకు మధుమేహ, రక్తపోటు పరీక్షలు జరిపి ఆరోగ్య సంబంధిత సూచనలు అందించారు.సంస్థ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఆరోగ్యం మహాభాగ్యం” అని, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, ప్రతినిత్యం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అతహర్ పాష, సభ్యులు కాసుల వెంకటేశం, కటికం ప్రశాంత్, కొసనం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News