Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 08:49 PM

స్పష్టమైన దృష్టి లేకపోతే జీవితంలో పనులు కష్టతరం

స్పష్టమైన దృష్టి లేకపోతే జీవితంలో పనులు కష్టతరం

స్పష్టమైన దృష్టి లేకపోతే జీవితంలో పనులు కష్టతరం
February 26, 2026 07:12 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

కంటి, మధుమేహ, రక్తపోటు పరీక్షల ఉచిత శిబిరం

మానవ శరీరంలో అత్యంత సున్నితమైన, విలువైన అవయవాలలో నేత్రం అని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల్ అధ్యక్షుడు తిరందాసు జగన్నానాథం అన్నారు. స్పష్టమైన దృష్టి లేకపోతే జీవనలో అనేక పనులు కష్టతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు.పురపాలిక కేంద్రంలోని వలిగొండ రోడ్డులోని లయన్స్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ట్రాఫిక్ పోలీస్ సహకారంతో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, మధుమేహ, రక్తపోటు పరీక్షల శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరాన్ని ట్రాఫిక్ సీఐ విజయ్ మోహన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.కంటి నిపుణులు గుంటోజు సంధ్యారాణి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు.పుర ప్రజలకు మధుమేహ, రక్తపోటు పరీక్షలు జరిపి ఆరోగ్య సంబంధిత సూచనలు అందించారు.సంస్థ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఆరోగ్యం మహాభాగ్యం” అని, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, ప్రతినిత్యం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అతహర్ పాష, సభ్యులు కాసుల వెంకటేశం, కటికం ప్రశాంత్, కొసనం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News