స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం
స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం
Editor Desk
డాక్టర్ వినయ్ కుమార్
వైద్యాధికారి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, రేపాల
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ. కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు కలిగి ఉండడం ఏమైనా లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక ఆశా కార్యకర్తలు కు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని గుర్తించి నిర్ధారణ అయినట్లయితే వారికి ఎండిటి చికిత్స విధానం ద్వారా వ్యాధిని నయంచేయవచ్చని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే సమయంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తదుపరి ఆరోగ్య సిబ్బంది చే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బి భాస్కర్ రాజు,డాక్టర్ వైష్ణవి,ఏఎన్ఎం సూపర్వైజర్ జయమ్మ, నర్సింగ్ ఆఫీసర్ సునీత, హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ, ఏఎన్ఎంకే పద్మ పావని ఆశ వర్కర్స్ జ్యోతి,రమణ ఫార్మసిస్ట్ శాంతయ్య ల్యాబ్ టెక్నీషియన్ ఫణీంద్ర,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి