సాంప్రదాయ వేడుకల మధ్య ఘనంగా వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి దంపతుల షష్ఠిపూర్తి బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు
సాంప్రదాయ వేడుకల మధ్య ఘనంగా వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి దంపతుల షష్ఠిపూర్తి బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు
GADDAM JAGANMOHAN REDDY
కవితలతో ఆకట్టుకున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిరంగి పుల్లయ్య
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి–2 వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి, ఆయన సతీమణి విశ్వభారతి దంపతుల షష్ఠిపూర్తి మహోత్సవం వారి స్వగ్రామమైన చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతులతో నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సాంప్రదాయ శోభను సంతరించుకున్నాయి.
వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ శుభకార్యక్రమంలో దంపతులు మరోసారి వివాహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ పునర్వివాహ వేడుకలా ఆనందంగా పాల్గొన్నారు. గ్రామస్థులు, సన్నిహితులు దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మండల పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి, చాట్రాయి మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యా రంగంలో వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిరంగి పుల్లయ్య తన కవితా ప్రతిభను ప్రదర్శిస్తూ షష్ఠిపూర్తి దంపతులను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా రచించిన పద్యాలను ఆలపించారు. ఆయన పద్యాలు సభికులను మంత్రముగ్ధులను చేస్తూ హర్షధ్వానాలు పొందాయి.
కార్యక్రమం అనంతరం అతిథులందరికీ ఘనంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు, గ్రామస్తులు దంపతులకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి రమేష్, మోరంపూడి నాగేశ్వరరావు, వనమా వాసు,తీర్ధాల అబ్బుత రావు, బంధు మిత్రులు, మండల పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి