Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:37 PM

సాంప్రదాయ వేడుకల మధ్య ఘనంగా వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి దంపతుల షష్ఠిపూర్తి బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు

సాంప్రదాయ వేడుకల మధ్య ఘనంగా వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి దంపతుల షష్ఠిపూర్తి బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు

సాంప్రదాయ వేడుకల మధ్య ఘనంగా వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి దంపతుల షష్ఠిపూర్తి బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు
March 15, 2026 08:34 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కవితలతో ఆకట్టుకున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిరంగి పుల్లయ్య

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి–2 వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి, ఆయన సతీమణి విశ్వభారతి దంపతుల షష్ఠిపూర్తి మహోత్సవం వారి స్వగ్రామమైన చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతులతో నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సాంప్రదాయ శోభను సంతరించుకున్నాయి.

వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ శుభకార్యక్రమంలో దంపతులు మరోసారి వివాహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ పునర్వివాహ వేడుకలా ఆనందంగా పాల్గొన్నారు. గ్రామస్థులు, సన్నిహితులు దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మండల పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి, చాట్రాయి మండల విద్యాశాఖాధికారి–1 మాసగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యా రంగంలో వజ్రాల సత్య వీర బ్రహ్మాచారి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిరంగి పుల్లయ్య తన కవితా ప్రతిభను ప్రదర్శిస్తూ షష్ఠిపూర్తి దంపతులను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా రచించిన పద్యాలను ఆలపించారు. ఆయన పద్యాలు సభికులను మంత్రముగ్ధులను చేస్తూ హర్షధ్వానాలు పొందాయి.

కార్యక్రమం అనంతరం అతిథులందరికీ ఘనంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు, గ్రామస్తులు దంపతులకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి రమేష్, మోరంపూడి నాగేశ్వరరావు, వనమా వాసు,తీర్ధాల అబ్బుత రావు, బంధు మిత్రులు, మండల పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News