సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. పండగ రోజుల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో, మధ్యమధ్యన రోడ్డు దాటే క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమీపంలో ఉన్న రోడ్డును ఈరోజు తాత్కాలికంగా మూసివేస్తామని పోలీసులు తెలిపారు. రహదారి దాటే సమయంలో జరిగే ప్రమాదాలను నివారించడంతో పాటు వాహనాల సాఫీగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి