Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:56 PM

సమస్యలు చెప్పండి.. పరిష్కారం మా బాధ్యత: ఎస్పీ పరితోష్ పంకజ్

సమస్యలు చెప్పండి.. పరిష్కారం మా బాధ్యత: ఎస్పీ పరితోష్ పంకజ్

సమస్యలు చెప్పండి.. పరిష్కారం మా బాధ్యత: ఎస్పీ పరితోష్ పంకజ్
08-06-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మకుండా తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును జిల్లా పోలీసు కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

Sthanikam

సమస్యలు చెప్పండి.. పరిష్కారం మా బాధ్యత: ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మకుండా తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును జిల్లా పోలీసు కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News