సమస్యలు చెప్పండి.. పరిష్కారం మా బాధ్యత: ఎస్పీ పరితోష్ పంకజ్
సమస్యలు చెప్పండి.. పరిష్కారం మా బాధ్యత: ఎస్పీ పరితోష్ పంకజ్
Krishna
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసు స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మకుండా తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును జిల్లా పోలీసు కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి