Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:05 AM

సామ్రాజ్య వాదాన్ని తరిమికొడదాం

సామ్రాజ్య వాదాన్ని తరిమికొడదాం

సామ్రాజ్య వాదాన్ని తరిమికొడదాం
February 21, 2026 06:06 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

సామ్రాజ్య వాదాన్ని తరిమికొడదాం..!

అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని తన ఆయుధ బలగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య దేశాల పైన యుద్ధాలు ప్రకటించి ఆయిలను కొల్లగొట్టేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు .స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం ఫిబ్రవరి 21 న రెడ్ బుక్ డే సందర్భంగా *బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదం అనే* పుస్తకం పై నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ట్రంపు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశాల మధ్య యుద్ధాలను సృష్టిస్తూ ప్రపంచంలో అశాంతిని సృష్టిస్తూ ఆయుధాలను అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వెనిజులాలో ప్రజాస్వామ్యకితంగా ఎన్నికైన ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మధురో ను అతని భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించడం ఏ మమైనా చర్య అని ఆయన విమర్శించారు .అట్లాగే గతంలో అమెరికా ఇరాక్ లిబియా చిలి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుల్ని హతమార్చి తన కీలుబొమ్మ ప్రభుత్వాలును పెట్టుకొని చమురు ఆధిపత్యాన్ని చలామణి చేశారని ఆయన అన్నారు .ఆయా దేశాల పైన యుద్ధాలు చేసి తన ఆయుధ సంపదను అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకాల పేరుతో భారత్ పై యుద్ధం ప్రకటించారని అమెరికా ట్రంప్ తనపై సుంకాల విధిస్తుంటే మోడీ మాత్రం మౌనవ్రతం వీడలేదని ఆయన విమర్శించారు సామ్రాజ్యవాదం లాంటి విష సర్పాలను అంతమొందించకపోతే ప్రపంచ శాంతికి మనుగడ ఉండదని ఆయన అన్నారు.ఈ యొక్క సమావేశానికి రాపోలు సూర్యనారాయణ అధ్యక్ష వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సైదా జిల్లెపల్లి నరసింహారావు జూలకంటి విజయలక్ష్మి బెల్లంకొండ సత్యనారాయణ సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు మునగాల సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అలసగాని బ్రహ్మయ్య నాగటి రాములు ఉయ్యాల నరసయ్య దేవర వెంకటరెడ్డి వీరబోయిన వెంకన్న చందా చంద్రయ్య మండవ వెంకటాద్రి సోంపంగు జానయ్య ఆరే రామకృష్ణారెడ్డి జుట్టుకొండ వీరయ్య కొండమడుగుల చిన్న వెంకటేశ్వర్లు గోపతి బిక్షం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News