తెలంగాణ: ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు దెబ్బతిన్నాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. పలు డిపో మేనేజర్లు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు.
పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు సమీప డిపోలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పోలీసుల ఎస్కార్ట్ మధ్య అద్దె బస్సులను నడుపుతూ ప్రయాణికులకు కొంత ఉపశమనం కల్పిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి