Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

సామాజిక న్యాయం కోసం సేవా కార్యక్రమంలో స్వామి జయంతి ప్రత్యేక ప్రాధాన్యం

సామాజిక న్యాయం కోసం సేవా కార్యక్రమంలో స్వామి జయంతి ప్రత్యేక ప్రాధాన్యం

సామాజిక న్యాయం కోసం సేవా కార్యక్రమంలో స్వామి జయంతి ప్రత్యేక ప్రాధాన్యం
January 12, 2026 07:24 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:తొర్రూరు డివిజన్ లో జనవరి 12, సోమవారం స్థానిక మున్సిపల్ కేంద్రం, హరిపిరాల రోడ్డులో స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఘనంగా జయంతి మహోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్, సామాజిక న్యాయం మరియు సేవల కోసం పనిచేసే సంస్థ “సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా” తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తోపాటు టీం సభ్యులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులుర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద జీవితాన్ని చదవాల్సిన అవసరం ఉందని, వారి ఆలోచనలు, సూత్రాలు యువతకు మార్గదర్శకంగా ఉండగలవని, అలాగే భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాసమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నల్లాం శ్రీనివాసు, నరేష్, రమేష్, వీరాస్వామి తదితరులు సకల ఏర్పాట్లలో పాల్గొన్నారు. యువత స్వామి వివేకానంద సూత్రాలను గుర్తు చేసుకుని, తన జీవితంలో అమలు చేసుకోవడం ద్వారా సమాజానికి మంచి మార్పు తీసుకురావాలని వారు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News