Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:55 AM

సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి

సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి

సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి
February 25, 2026 05:58 PM 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక వైద్య పరికరాల అందజేత – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

మాజసేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. డాక్టర్స్ ఫర్ యు స్వచ్ఛంద సంస్థ సహకారంతో హెచ్సిఎల్ ఫౌండేషన్ విరాళంగా అందించిన అత్యాధునిక వైద్య పరికరాలను సూర్యాపేట ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు అందించిన హెచ్సిఎల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరికరాలు రోగుల సంరక్షణను, వైద్య సేవల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడం ఎంతో ఉపయుక్తమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రైవేటు స్థాయికి తగ్గకుండా వైద్యం అందుతుందనే నమ్మకం పేద ప్రజల్లో పెరుగుతుందని అన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లలేని రోగులకు ఈ పరికరాలు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈ విరాళం అందించబడిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు వైద్య విద్యాధికారి మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జయలత, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి అదనపు వైద్య విద్యాధికారి మరియు వైద్య అధికారి డాక్టర్ పి. శ్రావణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, హెచ్సిఎల్ ఫౌండేషన్ సహాయ సంచాలకురాలు సీమి సూరి, డాక్టర్ చేతన తీర్థహళ్లి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News