Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:58 AM

సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం

సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం

సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం
21-03-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ఏదులాపురం ప్రాంతంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా, మత సామరస్యానికి నిదర్శనంగా ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ మద్దులపల్లిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లిం సోదరులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

పండుగ సందర్భంగా మద్దులపల్లిలోని ఎస్.కె. జానీ నివాసం, ఖమ్మం నగరంలోని సీనియర్ నాయకుడు ఎస్.కె. ఇమామ్ భాయ్ గృహాలను సందర్శించిన దయాకర్ రెడ్డి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఈద్ ముబారక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్ గొడ్డుగొర్ల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం

Article Image

ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ఏదులాపురం ప్రాంతంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా, మత సామరస్యానికి నిదర్శనంగా ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ మద్దులపల్లిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లిం సోదరులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

పండుగ సందర్భంగా మద్దులపల్లిలోని ఎస్.కె. జానీ నివాసం, ఖమ్మం నగరంలోని సీనియర్ నాయకుడు ఎస్.కె. ఇమామ్ భాయ్ గృహాలను సందర్శించిన దయాకర్ రెడ్డి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఈద్ ముబారక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్ గొడ్డుగొర్ల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News