సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం
సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం
ఎడిటోరియల్ టీమ్
ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ఏదులాపురం ప్రాంతంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గంగా-జమునా తెహజీబ్కు ప్రతీకగా, మత సామరస్యానికి నిదర్శనంగా ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ మద్దులపల్లిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లిం సోదరులకు అండగా నిలుస్తుందని తెలిపారు.
పండుగ సందర్భంగా మద్దులపల్లిలోని ఎస్.కె. జానీ నివాసం, ఖమ్మం నగరంలోని సీనియర్ నాయకుడు ఎస్.కె. ఇమామ్ భాయ్ గృహాలను సందర్శించిన దయాకర్ రెడ్డి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఈద్ ముబారక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్ గొడ్డుగొర్ల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి