Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:26 PM

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి
March 26, 2026 09:07 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సఖి సెంటర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సందర్శించారు. హౌసింగ్ బోర్డ్‌లో ఉన్న సెంటర్‌లో సిబ్బంది వివరాలు, అందిస్తున్న సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

సఖి సెంటర్‌కు వచ్చే కేసుల స్వరూపం, బాధిత మహిళలకు అందిస్తున్న కౌన్సిలింగ్, సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సెంటర్ కీలక పాత్ర పోషించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

అనంతరం మాస్కుంటలో నిర్మాణంలో ఉన్న సఖి భవనాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం భవనాన్ని సందర్శించి పనులు వేగవంతం చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News