Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:04 AM

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి
26-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సఖి సెంటర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సందర్శించారు. హౌసింగ్ బోర్డ్‌లో ఉన్న సెంటర్‌లో సిబ్బంది వివరాలు, అందిస్తున్న సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

సఖి సెంటర్‌కు వచ్చే కేసుల స్వరూపం, బాధిత మహిళలకు అందిస్తున్న కౌన్సిలింగ్, సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సెంటర్ కీలక పాత్ర పోషించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

అనంతరం మాస్కుంటలో నిర్మాణంలో ఉన్న సఖి భవనాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం భవనాన్ని సందర్శించి పనులు వేగవంతం చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి

Article Image

జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సఖి సెంటర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సందర్శించారు. హౌసింగ్ బోర్డ్‌లో ఉన్న సెంటర్‌లో సిబ్బంది వివరాలు, అందిస్తున్న సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

సఖి సెంటర్‌కు వచ్చే కేసుల స్వరూపం, బాధిత మహిళలకు అందిస్తున్న కౌన్సిలింగ్, సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సెంటర్ కీలక పాత్ర పోషించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

అనంతరం మాస్కుంటలో నిర్మాణంలో ఉన్న సఖి భవనాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం భవనాన్ని సందర్శించి పనులు వేగవంతం చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News