సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి
సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి
Editor Desk
జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సఖి సెంటర్ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సందర్శించారు. హౌసింగ్ బోర్డ్లో ఉన్న సెంటర్లో సిబ్బంది వివరాలు, అందిస్తున్న సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
సఖి సెంటర్కు వచ్చే కేసుల స్వరూపం, బాధిత మహిళలకు అందిస్తున్న కౌన్సిలింగ్, సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సెంటర్ కీలక పాత్ర పోషించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు.
అనంతరం మాస్కుంటలో నిర్మాణంలో ఉన్న సఖి భవనాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం భవనాన్ని సందర్శించి పనులు వేగవంతం చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి