సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విద్యార్థులకు దేశంలో అపార అవకాశాలున్నాయని,యువత విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని స్థానిక కె ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.. నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన ప్రతిభ కనబరిచినప్పుడే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు అన్నారు. సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు విద్యను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చినారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి