Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

సిర్గాపూర్ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై:ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి ప్రత్యేక దృష్టి

సిర్గాపూర్ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై:ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి ప్రత్యేక దృష్టి

సిర్గాపూర్ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై:ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి ప్రత్యేక దృష్టి
04-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం గ్రామ కేంద్రంలో హాస్టల్ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడి,వారి సమస్యలు అడిగి తెలుసుకున్న నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి నేరుగా హాజరై విద్యార్థుల సమస్యలను గమనించి,వీటికి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.విద్యార్థులకు భరోసా ఇచ్చి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ప్రతి విద్యార్థికి అందాల్సిన అలావెన్స్ మరియు సౌకర్యాలను సమగ్రంగా చూసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు తక్షణమే పరిష్కరించబడేలా, విద్యార్థులు స్వచ్ఛందంగా తమ సమస్యలను గౌరవ శాసనసభ్యుడికి తెలియజేయవచ్చని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో యాదవ రెడ్డి (మాజీ సర్పంచ్), బిక్షపతి యాదవ్, పిరప్ప (మాజీ ఎంపీటీసీ), చంద శ్రీనివాస్ (హాస్టల్ వెల్ఫేర్ అధికారి), స్థానిక వార్డ్ సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీరు విద్యార్థుల సమస్యలను సమగ్రంగా చర్చించి,తదుపరి చర్యల కోసం అధికారులతో సమన్వయం కొనసాగించేలా కృషి చేశారు.ఈ కార్యక్రమం ద్వారా హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామనే సంకల్పం స్పష్టమైంది. జిల్లా స్థాయిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు సక్రమ మానిటరింగ్, సంబంధిత అధికారులు మరింత నిబద్ధతగా వ్యవహరిస్తారని, హాస్టల్ విద్యార్థులు భవిష్యత్తులో సౌకర్యాలను పొందుతారని తెలుస్తుంది.

Sthanikam

సిర్గాపూర్ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై:ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి ప్రత్యేక దృష్టి

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం గ్రామ కేంద్రంలో హాస్టల్ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడి,వారి సమస్యలు అడిగి తెలుసుకున్న నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి నేరుగా హాజరై విద్యార్థుల సమస్యలను గమనించి,వీటికి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.విద్యార్థులకు భరోసా ఇచ్చి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ప్రతి విద్యార్థికి అందాల్సిన అలావెన్స్ మరియు సౌకర్యాలను సమగ్రంగా చూసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు తక్షణమే పరిష్కరించబడేలా, విద్యార్థులు స్వచ్ఛందంగా తమ సమస్యలను గౌరవ శాసనసభ్యుడికి తెలియజేయవచ్చని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో యాదవ రెడ్డి (మాజీ సర్పంచ్), బిక్షపతి యాదవ్, పిరప్ప (మాజీ ఎంపీటీసీ), చంద శ్రీనివాస్ (హాస్టల్ వెల్ఫేర్ అధికారి), స్థానిక వార్డ్ సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీరు విద్యార్థుల సమస్యలను సమగ్రంగా చర్చించి,తదుపరి చర్యల కోసం అధికారులతో సమన్వయం కొనసాగించేలా కృషి చేశారు.ఈ కార్యక్రమం ద్వారా హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామనే సంకల్పం స్పష్టమైంది. జిల్లా స్థాయిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు సక్రమ మానిటరింగ్, సంబంధిత అధికారులు మరింత నిబద్ధతగా వ్యవహరిస్తారని, హాస్టల్ విద్యార్థులు భవిష్యత్తులో సౌకర్యాలను పొందుతారని తెలుస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News