Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 08:52 PM

సైనిక్ పాఠశాల ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం

సైనిక్ పాఠశాల ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం

సైనిక్ పాఠశాల ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం
February 28, 2026 06:47 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

50 మంది పరీక్ష రాస్తే 45 మంది అర్హత

రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్రస్థానాలు

సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కూసుమంచి కేంద్రంలో నిర్వహిస్తున్న ఆజాద్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 50 మంది విద్యార్థుల్లో 45 మంది అర్హత సాధించడం విశేషం. గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించి గుర్తింపు పొందిన ఈ కేంద్రం, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించడంతో యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ స్థానాలు దక్కించుకోవడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

మిన్నంటిన సంబరాలు

ఫలితాలు వెలువడిన వెంటనే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. అర్హత సాధించిన విద్యార్థులను సన్మానించారు.

ఈ సందర్భంగా నిర్వహణాధికారి మరియు విద్యా విభాగాధిపతి అజహరుద్దీన్ మహ్మద్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా నవోదయలో 30 స్థానాలు, ఏకలవ్యలో 14 స్థానాలు, రాష్ట్ర సైనిక్ పాఠశాలలో మూడో స్థానం, వందలోపు 14 ర్యాంకులు సాధించామని గుర్తు చేశారు. వెనుకబడిన ఖాళీల్లో 36 స్థానాలు సాధించిన ఏకైక సంస్థగా జిల్లా స్థాయిలో తమ కేంద్రం నిలిచిందన్నారు.

కరస్పాండెంట్ జానిమియా మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫలితాలు మరింత మెరుగైన విజయాలకు నాంది పలుకుతున్నాయని అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆజాద్, సబిహా, సయ్యద్ మియా తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News