Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:36 PM

సైనిక్ పాఠశాల ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం

సైనిక్ పాఠశాల ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం

సైనిక్ పాఠశాల ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం
February 28, 2026 06:47 PM 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

50 మంది పరీక్ష రాస్తే 45 మంది అర్హత

రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్రస్థానాలు

సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కూసుమంచి కేంద్రంలో నిర్వహిస్తున్న ఆజాద్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 50 మంది విద్యార్థుల్లో 45 మంది అర్హత సాధించడం విశేషం. గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించి గుర్తింపు పొందిన ఈ కేంద్రం, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించడంతో యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ స్థానాలు దక్కించుకోవడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

మిన్నంటిన సంబరాలు

ఫలితాలు వెలువడిన వెంటనే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. అర్హత సాధించిన విద్యార్థులను సన్మానించారు.

ఈ సందర్భంగా నిర్వహణాధికారి మరియు విద్యా విభాగాధిపతి అజహరుద్దీన్ మహ్మద్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా నవోదయలో 30 స్థానాలు, ఏకలవ్యలో 14 స్థానాలు, రాష్ట్ర సైనిక్ పాఠశాలలో మూడో స్థానం, వందలోపు 14 ర్యాంకులు సాధించామని గుర్తు చేశారు. వెనుకబడిన ఖాళీల్లో 36 స్థానాలు సాధించిన ఏకైక సంస్థగా జిల్లా స్థాయిలో తమ కేంద్రం నిలిచిందన్నారు.

కరస్పాండెంట్ జానిమియా మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫలితాలు మరింత మెరుగైన విజయాలకు నాంది పలుకుతున్నాయని అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆజాద్, సబిహా, సయ్యద్ మియా తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News